Sunday, May 5, 2024
- Advertisement -

సిఎంతో నాకు ఎఫైర్ ఉంది

- Advertisement -

అస్సాం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ కి తనకి మధ్య ప్రేమాయణం నడిచిందని ప్రముఖ గాయని అలోక పాండే బాంబు పేల్చారు. ఓ టివి ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సిఎం తరుణ్ గొగోయ్ తాను మనసులు ఇచ్చిపుచ్చుకున్నామని అన్నారు.

తన తల్లి, ప్రముఖ జానపద గాయని ప్రతిమా బారువా పాండే మరణించిన తర్వాత ఉద్యోగం కోసం తాను ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ ని కలిసానని, అప్పుడు నన్ను చూసిన ఆయన ప్రేమలో పడ్డారని గాయని అలోక పాండే చెప్పారు. తామిద్దరూ 2004 నుంచి 2006 వరకూ ప్రేమలో మునిగితేలామని చెప్పారు. దీనిపై సిఎం తరుణ్ గొగోయ్ మండిపడ్డారు.

గతంలో కూడా అలోక పాండే ఇలాంటి ఆరోపణలే చేస్తే గొగోయ్ పరువు నష్టం దావా వేశారు. అయితే ఈసారి తాను పరువు నష్టం దావా వేయనని గొగోయ్ తెలిపారు. అలోక పాండే బిజెపిలో ఉన్నారని, రాజకీయ కక్షలో భాగంగా ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఆయన తేల్చిపారేశారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -