Monday, April 29, 2024
- Advertisement -

సిక్సు కొడితే రూ.వేయి.. మంత్రి హరీష్ రావు ప్రకటన..!

- Advertisement -

యువత అన్ని రంగాల్లో ఆల్‌రౌండర్‌గా ప్రతిభ చాటాలి. చదువు, ఆటలు, సామాజిక సేవలో రాణించాలి. తల్లిదండ్రులు, గురువులు, పెద్దలను గౌరవిస్తూ తోటి వారికి సహకారం అందించాలి’ అని మంత్రి హరీశ్‌రావు సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ జన్మదినాన్ని పురస్కరించుకొని సిద్దిపేటలోని క్రీడా మైదానంలో కేసీఆర్‌ క్రికెట్‌ ట్రోఫీని ఆవిష్కరించారు. కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు.

విజేత జట్టుకు రూ.1,00,116, రన్నర్‌ జట్టుకు రూ.50,116 ఇస్తామని మంత్రి హరీశ్​రావు తెలిపారు. సిక్సు కొడితే రూ.వేయి చొప్పున ప్రోత్సాహకం అందజేస్తామని ప్రకటించారు. ట్రోఫీ తుది పోటీలకు ప్రముఖ క్రికెటర్లు అజహరుద్దీన్‌, వీవీఎస్‌ లక్ష్మణ్‌ను ఆహ్వానించామన్నారు. స్థానికంగా అన్ని హంగులు, ప్రమాణాలతో క్రీడా మైదానాన్ని అభివృద్ధి చేశామని, 16 రకాల కోర్టులు అందుబాటులో ఉన్నాయన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -