- Advertisement -
శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం జిల్లాలోని మండలంలోని బిర్లింగి గ్రామంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మహిళలు మృతి చెందడంతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. మృతుల్లో ఇద్దరు తోటి కోడళ్లు, ఇద్దరు బాలికలు.
ఆటో నడుపుతూ జీవనం సాగించే దూపాన సీతారాం భార్య ఢిల్లమ్మ(35), కుమార్తె గాయత్రి(12), తమ్ముడి భార్య కమల(32), తమ్ముడి కుమార్తె(11) కలిసి బట్టలు ఉతికేందుకు స్థానిక బాహుదా నదికి వెళ్లారు. వారంతా ప్రమాదవశాత్తు నదిలో మునిగి మృతి చెందినట్టు పోలీసులు భావిస్తున్నారు.మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఇచ్చాపురం ఆస్పత్రికి తరలించారు.గ్రామ పంచాయతీ కార్యదర్శి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.