శ్రీలంక రాజధాని కొలంబోలో ఈస్టర్ డే రోజు ఉగ్రమూకలు మారణహోమం సృష్టించాయి. చర్చ్లు, హోటళ్లే లక్ష్యంగా ఆత్మాహుతిదాడులు జరిగిన సంగతి తెలిసిందే. ఈ పేళుల్లో 300మందికిపైగా చనిపోగా.. వీరిలో 10మందికిపైగా భారతీయులు ఉన్నారు. ఈ పేళుల్లనుంచి వైసీపీకీ చెందిన అనకాపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ తృటిలో తప్పించుకున్నారు. ఆయనే స్వయంగా వెల్లడించారు.
స్నేహితులతో కొలంబో పర్యటనకు వెళ్లిన ఆయన.. కింగ్స్జ్యూరీ హోటల్కు చెందిన ఫ్లాట్లో బసచేశారు. పేలుళ్ల సమయంలో కూడా ఫ్లాట్లోనే ఉన్నారట.. వారి పక్క అపార్ట్మెంట్లోనే పేలుళ్లు జరిగాయిని తెలిపారు. వాస్తవానికి సోమవారం రాత్రి కొలంబో నుంచి బయల్దేరాల్సి ఉన్నా.. పేలుళ్లు జరగ్గానే అమర్నాథ్ స్నేహితులు కలిసి విశాఖ వచ్చేందుకు ప్రయత్నించారు. ఎయిర్పోర్టులో కూడా బాంబులు పెట్టారని సమాచారంతో.. విమాన రాకపోకలు ఆగిపోయాయి. దీంతో సోమవారం ఉదయం ఫ్లైట్లో చెన్నై వెళ్లి.. అక్కడి నుంచి విశాఖకు చేరుకున్నారు.