- Advertisement -
పేపర్ చదువుతూ గుండె పోటుతో ఒ ఎమ్మెల్యే మృతి చెందిన సంఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. అన్నాడీఎంకే ఎమ్మెల్యే కనగరాజ్ చెన్నైలోని తన ఇంట్లో ఈరోజు పేపర్ చదువుతుండగా గుండె నొప్పి వచ్చింది. దీంతో ఆయన అక్కడే కుప్పకూలిపోయారు. కుటుంబసభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. 2016 ఎన్నికల్లో అన్నాడీఎం తరఫున విజయం సాధించారు. కనగరాజ్ మృతితో తమిళనాడు అసెంబ్లీలో ఖాళీ స్థానాల సంఖ్య 22కు చేరుకుంది.