Tuesday, May 21, 2024
- Advertisement -

బాలయ్య పిఏపై ఫైరౌతోన్న టీడీపీ శ్రేణులు

- Advertisement -

బాలకృష్ణ హిందూపురం నుంచి గెలవడం ఆయన అభిమానులకే కాదు,హిందూపురం టీడీపీ శ్రేణులకు కూడా ఆనందదాయకమే.

దానికి కారణం బాలయ్య గెలిచాక ఎలాగూ ఇక్కడ ఉండకుండా హైద్రాబాద్లోనే ఉంటాడు కాబట్టి … ఇక్కడ మొత్తం తామే చక్రం తిప్పేయెచ్చని అబ్దుల్ ఘనీ,పామిశెట్టి రంగనాయకులు లాంటి మాజీ టీడీపీ ఎమ్.ఎల్.ఏ. లు భావించారు. కాని గెలిచాక సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది.హైద్రాబాద్ లో కంటే హిందూపురంలోనే బాలకృష్ణ ఎక్కువగా ఉంటున్నారు. దీంతో బాలయ్య పి.ఏ. అయినటువంటి శేఖర్ ఒక్కసారిగా పెత్తనం తీసుకున్నాడు. ఎంతలా అంటే….  ఒక్క మాటలో చెప్పాలంటే అతనే అనధికార హిందూపురం ఎమ్ ఎల్ ఏ.అతను  సీమ బిడ్డ కాదు. హిందూపురం గురించి తెలియడానికి. పక్కా కోస్తావాసి.ఇతను చేసే పనులు చూస్తుంటే… అక్కడి టీడీపీ లీడర్లు బెంబేలెత్తు పోతున్నారు. 

తమ పక్కనే ఉన్న బెంగుళూరుకు ఇసుకను తరలించడం దగ్గరి నుంచి ,మున్సిపాలిటీకి స్వీపర్ పోస్ట్ లను అమ్ముకోవడం లాంటి పనులన్నీ అతని కనుసన్నల్లోనే నడుస్తున్నాయని ప్రచారం పీక్ స్టేజ్ లో ఉంది. అందుకే తమ్ముళ్లు అసంతృప్తిలో ఉన్నారు. ఏనిమిషాన ఈ అసంతృప్తి పేలుతుందో తెలియదుగాని పేలితే మాత్రం బాలయ్య చంద్రబాబు దృష్టిలో చులకన అయిపోతాడు. ఏమో రేపన్న రోజు బాలయ్యసీన్ తగ్గించడానికి  పిఏ శేఖర్ చేస్తోన్న పనులను చంద్రన్న  అడ్డం  పెట్టుకున్నా పెట్టుకుంటాడని అనంతపురం జిల్లాలో ఒకటే చర్చ నడుస్తోంది.ఏం బాలయ్య ఇకనైన తేరుకుని తమరి పిఏ పెత్తనాన్ని కట్ చేస్తే మంచిది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -