రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీలోకి వలసలు ఊపందుకున్నాయి. బాబు పరిపాలనపై విసుగు చెందిన ఆపార్టీ నేతలు ఇప్పుడు వైసీపీ లో కి క్యూకడుతున్నారు. సార్వత్రిక ఎన్నికలు మరో రెండ సంవత్సరాలే ఉండటంతో టీడీపీపై అసంతృప్తిగా ఉన్న నేతలపై దృష్టిసారించిన వైసీపీ అదిశగా అడుగులు వేస్తోంది.
ఇక తాజాగా విశాఖ జిల్లా చోడవంరం నియేజక వర్గానికి చెందిన 450 మంది టీడీపీ నాయకులు,కార్యకర్తలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.నియేజవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ సమక్షలో పార్టీలో చేరారు. వారందరికి ధర్మశ్రీ వైసీపీ కండువాలను కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వా నించారు.గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను బాబు నెరవేర్చడంలో విఫలమైనందునే వైసీపీలోకి వెల్తున్నామని పార్టీ మారిన నాయుకలు చెప్పతున్నారు.
వైసీపీలోకి వలసలు ఊపందుకోవడంతో టీడీపీ శ్రేనులు ఆందోళనలో ఉన్నారు. ఎన్నికలకు సమయం ఉన్నా ఇప్పటినుంచే టీడీపీకి వలసల భయం పట్టుకుంది. ఇప్పుడే ఇలా వలసుల ఉంటె ఎన్నికల సమయంలో పార్టీలో ఎవరకుఉంటారో ఎవరు బయటకు వెల్తారో తెలియన గందరగోల పరిస్థితుల్లో పచ్చపార్టీ ఉంది.వలసనలు ఆపేందుకు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అవన్నీ విఫలమవుతూనె ఉన్నాయి.దీంతో ఏంచేయాలో తలలు పట్టుకుంటున్నారు టీడీపీ నాయకులు.
{youtube}EWyqtHVPdq4{/youtube}
Related