- Advertisement -
సినీనటుడు, టీడీపీ సీనియర్ నేత మాజీ ఎంపీ శివప్రసాద్ ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ప్రస్తుతం ఆయనకు చెన్నైలోని అపోలో ఆసుపత్రి లో వైద్యులు వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.గత కొంతకాలంగా అనారోగ్యంతో సతమతమవుతున్న శివప్రసాద్ కిడ్నీ సంబంధిత సమస్య తలెత్తడంతో రెండు రోజుల క్రితమే చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో కుటుంబ సభ్యులు చేర్పించారు.
అప్పటినుంచి ఆయనకు డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. 2009, 2014లో చిత్తూరు నుంచి రెండుసార్లు టీడీపీ ఎంపీగా గెలిచిన శివప్రసాద్ గత ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు.ప్రత్యేక హోదా విషయంలో రకరకాల పద్దతుల్లో నిరసన తెలిపి తన దైన శైలిలో అకట్టుకున్నారు.