Wednesday, May 1, 2024
- Advertisement -

బాబుగారి మంత్రులు ఎక్కడా తగ్గరు.. అన్నీ ఓవర్ మాటలే..!

- Advertisement -

పుష్కరాలు అంటే.. వాటిని కుంభమేళా స్థాయిలో నిర్వహిస్తాం అని ప్రకటించారు. పుష్కరాల నిర్వహణతో ప్రపంచం మొత్తం ఏపీ వైపు చూడాలని అన్నారు.

చివరికి చూస్తే.. తొలి రోజే దారుణం జరిగింది.

ఏర్పాట్లో లోపమో లేక ముఖ్యమంత్రిగారే కారణమో కానీ ఏకంగా 29 మంది అమయాకుల ప్రాణాలు పోయాయి. అయితే చివరికి ఏమో పుష్కరాలను అద్భుతంగా నిర్వహించాం.. అని ప్రకటించుకొన్నారు. ఆల్ ఈజ్ వెల్ అని ప్రకటించుకొన్నారు. 

పుష్కరాలను ప్రపంచ స్థాయిలో నిర్వహించాం… అని ఇప్పుడు స్వతంత్ర దినోత్సవవేడుకులను నిర్వహించడానికి రెడీ అవుతున్నామని ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించాడు. మరి ఏదో నిర్వహించడానికి రెడీ అవుతున్నామని ప్రకటించి అంటే.. అది మామూలే అనిపించుకొనేది. ఇంతకీ గంటా ఏమంటారంటే… విశాఖ ఖ్యాతిని ఇనుమడింపజేసేలా ఇండిపెండెన్స్ డేను సెలబ్రేట్ చేస్తాం అన్నారు.

మరి దేశంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరిగేది కేవలం విశాఖలో మాత్రమే కాదు. దేశమంతా ఆ రోజున జరుగుతాయి. అయితే ఏపీ మంత్రుల ప్రకటనలు మాత్రం తమకు మించిన వారు లేరన్నట్టుగా ఉన్నాయి. మరి ఎలా నిర్వహిస్తారో.. విశాఖ ప్రతిష్టను ఎంత వరకూ పెంచుతారో చూద్దాం!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -