Tuesday, May 7, 2024
- Advertisement -

అవినీతి చేయడంలో బాబు తన మంత్రులకు సరిగా ట్రైనింగ్ ఇవ్వలేదా!

- Advertisement -

తను నిప్పులా బతికానని అంటాడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఆయన పదే పదే ఈ మాట చెబుతూ ఉంటాడు.

ఒకసారి కాదు రెండు సార్లు కాదు.. అనునిత్యం బాబు ఇదే మాటను రిపీట్ చేస్తూ ఉంటారు. ఈ కాలం రాజకీయాల్లో నీతిమంతులు ఎవరూ లేరనే సత్యాన్ని జనాలు విశ్వసిస్తున్నప్పటికీ.. బాబు మాత్రం పరమ నిజాయితీ పరుడిని అని చెప్పుకొంటూ.. చెప్పిందే చెబుతూ.. చివరకు తనకు తాను సర్టిఫికెట్ ఇచ్చేసుకొంటూ ఉంటారు. మరి ఇదిలా ఉంటే.. బాబు గారి క్యాబినెట్ లోని మంత్రులు మాత్రం ఒకరి తర్వాతగా మరొకరు అవినీతి వ్యవహారాల్లో ఇరుక్కొంటున్నారు.

కొందరైతే పదే పదే ఇలాంటి వ్యవహారాల్లో ఇరుక్కొంటున్నారు. తాజాగా మంత్రి పీతల సుజాత అయితే మరోసారి దొరికిన విషయం తెలిసిందే. తొలిసారి ఆమె వడ్డాణాన్ని బహుమతిగా స్వీకరించి మీడియాకు దొరికిపోయింది. అప్పట్లో అదో పెద్ద వివాదంఅ య్యింది. ఇక తాజాగా ఆమె మరో గిఫ్ట్ ను తీసుకొంటూ కూడా పట్టుబడిన సంగతి తెలిసిందే. మరి ఇలా ఒకే మంత్రి రెండు సార్లు అవినీతి వ్యవహారంలో వార్తల్లోకి రావడం అంటే మాటలు కాదు. అంతే కాదు.. ఆ మధ్య ఇదే మంత్రిగారి ఇంటి ఆవరణలో క్యాష్ బ్యాగ్ ఒకటి కలకలం రేపింది. మరి ఇలా పదే పదే పట్టుబడడంతో జనాలకు కూడా డౌట్లు వస్తున్నాయి.

మరి ఇప్పుడు చేయాల్సిన సూచన ఏమిటంటే.. బాబుగారు అర్జెంటుగా ఒక శిక్షణా తరగతులను ఏర్పాటు చేసుకోవాలి. అవినీతి విషయంలో వరసగా మంత్రులు దొరుకుతున్న తరుణంలో.. దొరికిన వాళ్్లే మళ్లీ మళ్లీ దొరుకుతున్న నేపథ్యంలో  ఎవరికీ తెలియకుండా అవినీతి చేయడం ఎలాగో ఈ మంత్రులు ట్రైనింగ్ తీసుకోవాలి. అప్పుడు కానీ.. బాబుకు గారి ఇమేజ్ డ్యామేజీ కాకుండా ఆగదు. ఒకవైపు బాబేమో తను నిజాయితీ పరుడిని.. తన పాలన పారదర్శకతో కూడుకొన్నది.. అంటూ ప్రచారం చేసుకొంటుంటే.. ఆయన మంత్రులు ఇలా అవినీతివ్యవహారాల్లో పట్టుబడుతూ ఉండటం నిజంగా చాలా చెత్తగా ఉంది!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -