Sunday, April 28, 2024
- Advertisement -

చంద్రబాబుకు అది చిన్న అవమానం అంటున్న టీడీపీ నేతలు!

- Advertisement -

తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భద్రత లేకుండా జనాల మధ్య కు వస్తే.. జనాలు ఆయను రాళ్లతో కొడతారన్న వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి మాటలపై తీవ్రంగా స్పందించింది తెలుగుదేశం పార్టీ. ఏకంగా నాలుగైదు మంది మంత్రులు ఈ అంశంపై స్పందించారు. వీరి స్పందన  కొంత విడ్డూరంగా ఉండటమే ఇక్కడ విశేషం. తమ పార్టీ అధినేతను ఎవరూ ఏం చేయలేకపోయారని.. ఆయన ఇంత వరకూ తిరుగు లేకుండా సాగుతున్నాడని వీరు అంటున్నారు. ఈ మాటల్లో మరింత అతి ఏమిటంటే…. తెలుగుదేశం అధినేత చంద్రబాబును ఎవరూ ఏమీ చేయలేకపోయారని వీరు అంటున్నారు.

రాజీవ్ గాంధీ, సోనియాగాంధీ, వైఎస్ రాజశేఖర్ రెడ్డిలే చంద్రబాబును ఏం చేయలేకపోయారని.. అర్భకుడు అయిన జగన్ మోహన్ రెడ్డి ఎంత? అని వీరు అంటున్నారు. మరి జగన్ ను తక్కువ చేసి చూపడటానికి ఈ మాటలు ఉపయోగపడతాయేమో కానీ.. బాబుకు తిరుగులేదు అని అని తెలుగుదేశం నేతలు అనడమే కొంత విడ్డూరంగా ఉంది.

రాజీవ్ , సోనియా, వైఎస్ లు బాబును ఏమీ చేయలేకపోయారని వీరు అనడం మరింత విడ్డూరం. ఎందుకంటే.. ప్రజాస్వామ్య రాజకీయాల్లో ఏ రాజకీయ నేత కూడా వ్యక్తిగతం మరొక రాజకీయ పార్టీ నేతపై వ్యక్తిగతంగా ఏమీ దాడి చేయడు కదా! అయినా బాబు కాంగ్రెస్ పార్టీ చేతిలోరెండు సార్లు ఓడిపోవడం నిజంకాదా?! 2004, 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బాబు ఆధ్వర్యంలో ఎన్నికలను ఎదుర్కొంది. ఆ రెండు సార్లూ ఓటమిని మూటగట్టుకొంది.

పదేళ్ల పాటు ప్రతిపక్షంలో కూర్చొంది. మరి ప్రజాస్వామ్య రాజకీయాల్లో అంత కన్నా అవమానం ఏముంది? 2014లో గెలిచినంత మాత్రానా.. అక్కడికి బాబుది అప్రహతీత రాజకీయ యాత్ర అన్నట్టుగా తెలుగుదేశం నేతలు మాట్లాడటం సిల్లీగా ఉంది. వారికి ఈ విషయం అర్థం కావడం లేదేమో కానీ.. జనాలకు మాత్రం అర్థం అవుతుంది కదా!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -