వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై టీడీపీ ఎంపీ రమేష్ మధ్య మాటల వార్ కొనసాగుతోంది. విజయ్ మాల్యా దగ్గర చంద్రబాబు రూ.150 కోట్లు పార్టీ ఫండ్గా తీసుకున్నారని విజయసాయి ఆరోపనలు చేసిన వెంటనే టీడీపీ ఎంపీ సీఎమ్ రమేష్ ఫైర్ అయ్యారు.
విజయసాయిరెడ్డి ప్రతి రోజూ పార్లమెంటులో ఏమీ చేయట్లేదు. ఈరోజు కూడా టీడీపీ సభ్యులు, రామచంద్రరావు, అన్నాడీఎంకే సభ్యులు వెల్లోకి వచ్చి ఆందోళన చేస్తుంటే ఈయన సభలో ఉండి కూడా నిశ్శబ్దంగా కూర్చున్నారు. ఇలా ప్రతి రోజూ సభ వాయిదా పడిన తరవాత విజయ చౌక్కు వచ్చి ముఖ్యమంత్రిపై అసభ్యకరంగా మాట్లాడుతున్నారు. ఇలా మాట్లాడితేనే మీడియాలో వచ్చి హైలైట్ అవుతానని భావిస్తున్నారని విమర్శించారు.
ఆర్థిక నేరాల కేసుల్లో ఏ2గా ఉన్న వ్యక్తి చంద్రబాబును విమర్శించడమేంటని అన్నారు. వైసీపీ నేతలు తప్పుడు విధానాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలిపిన ఇతర పార్టీల ఎంపీలను కలుస్తామని అన్నారు. బాబును విమర్శించే హక్కు విజయసాయిరెడ్డికి లేదన్నారు.