ఏపీలో ఎదగడంకోసం బాబు అమలు చేసిన ప్లాన్నె భాజాపా కూడా అమలు చేస్తోంది. గతంలో ఎలా అయితే బాబు ఫిరాయింపులను బాబు ప్రోత్సహించారో ఇప్పుడు భాజాపా కూడా అదే రీతిలో టీడీపీనీ భూస్తాపితం చేసేందుకు ఆపరేషన్ ఆకర్ష్ను ప్రారంభించింది. ఆకర్ష్లో టీడీపీకీ చెందిన నలుగురు రాజ్యసభ్య సభ్యలు కాషాయ కండువా కప్పు కున్నారు. వీరితో పాటు మరికొందరు కీలక నేతలు కూడా కమలం గూటికి చేరేందుకు సిద్దంగా ఉన్నారు.
రాష్ట్రాభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని తాము పార్టీ మారామని సుజనా, రమేష్, టీజీ వెంకటేష్ లు చేసిన వ్యాఖ్యలపై ఎంపీ కేశినేని నాని ఫేస్ బుక్ ఖాతాలో సెటైర్లు వేశారు.మీరేదో ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించడానికి బీజేపీ లోకి వెళుతున్నామని బిల్డప్ ఇచ్చారు. కానీ, నిన్న బడ్జెట్ చూసాక ఈ రాష్ట్ర ప్రజలకు బాగా అర్ధమయ్యింది, ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించడానికి బీజేపీ లోకి చేరారో లేక మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోడానికి బీజేపీ లోకి చేరారో అని…’’ అంటూ కౌంటర్లు వేశారు. గత కొంతకాలంగా.. కేశినేని తాను ఏం చెప్పాలని అనుకున్నా… సోషల్ మీడియా వేదికగానే స్పందిస్తున్న సంగతి తెలిసిందే.