Wednesday, May 15, 2024
- Advertisement -

ఆయన చెప్పేది నమ్మేద్దామా..!?

- Advertisement -

రాజధానిలో భూ దందా అంటూ ఓ దినపత్రిలో వస్తున్న వరుస కథనాలు.. టీడీపీ ముఖ్య నేతల్లో చలనం తెప్పిస్తున్నాయి. ముఖ్యంగా ఎంపీ మురళీమోహన్.. తనపై వచ్చిన ఆరోపణలకు తీవ్ర స్థాయిలో స్పందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు తాను బినామీనని నిరూపిస్తే.. బహిరంగంగా ఉరేసుకుంటానని సవాల్ విసిరారు.

నీతి నిజాయితీతో తాను రాజకీయాలు చేస్తున్నానని.. సినిమా రంగంతో పాటు.. రియల్ ఎస్టేట్ బిజినెస్ లో కూడా తాను వివాదాలకు దూరంగా ఉంటూ పని చేసుకుంటున్నానని మురళీ మోహన్ చెప్పుకొచ్చారు. తనపై గతంలో కూడా వైఎస్ రాజశేఖరరెడ్డి, పి. జనార్దన్ రెడ్డి వంటి అగ్ర నేతలు ఆరోపణలు చేసినా.. వాటిని నిరూపించలేకపోయారన్నారు.

నిజాయితీ కలిగిన తనలాంటి వాళ్లను బతకనివ్వరా అంటూ.. ఆవేశంగా స్పందించారు.. మురళీమోహన్. వైసీపీ అధినేత జగన్ లాగే తాను అవినీతి మార్గంలో నడుస్తున్నానని అనుకోవద్దని స్పష్టం చేశారు. తనపై ఆరోపణలు చేసేముందు వాస్తవాలు తెలుసుకోవాలని చెబుతున్నారు.

మరి మీరేమంటారు.. మురళీమోహన్ చెప్పేది నమ్మేద్దామంటారా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -