Saturday, April 20, 2024
- Advertisement -

విలన్లు మేము కాదు వాళ్లు అంటున్న టీడీపీ..!

- Advertisement -

విభజిత ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాను తెప్పించే విషయంలో తెలుగుదేశం నేతల మాటలు మరీ సిల్లీగా మారాయి. ఈ విషయంలో తాము విలన్లను కాకుండా చూసుకోవడానికి తెలుగుదేశం నేతలు కొత్త వ్యూహానికి తెరతీసినట్టుగా ఉన్నారు.

ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తమకు.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఇబ్బంది కలగకుండా.. దీని సాధన విషయంలో వైఫల్యాన్ని వేరే వాళ్లకు అంటగట్టడానికి తెలుగుదేశం నేతలు ప్రయత్నిస్తున్నారు.

ఇందులో భాగంగా కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు ప్రత్యేక హోదా విషయంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య పేరును తెరపైకి లాగాడు. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని కేంద్రానికి ఉన్నా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అడ్డుపడుతున్నాడని అశోక్ జగపతి అంటున్నాడు!

ఇది వరకూ ఇలాగే తెలుగుదేశం వారు జయలలిత పేరు చెప్పారు. ఏపీ కి ప్రత్యేక హోదా రాకుండా చేయడానికి జయలలిత ప్రయత్నిస్తున్నారని అప్పట్లో లోకేష్ బాబు చెప్పుకొచ్చాడు. ఇప్పుడు అశోక్ గజపతి రాజు ఏమో  దీనికి కారణం సిద్ధరామయ్య అని అంటున్నాడు. మరి ఇలా పక్క రాష్ట్రాల వారిని.. వేరే పార్టీల వాళ్లను విలన్లు చూపించి తాము సేఫ్ జోన్ లోకి రావాలని తెలుగుదేశం నేతలు భావిస్తున్నట్టుగా ఉన్నారు.

ఈ విధంగా ప్రత్యేక హోదా రాకపోవడంలో తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవాలని వారు భావిస్తున్నట్టుగా ఉన్నారు. మరి ఈ వ్యూహం ఫలిస్తుందా? తెలుగుదేశం నేతల మాటలను నమ్మి.. భారతీయ జనతా పార్టీ, టీడీపీలను జనాలు శుద్దపూసలుగా తీసుకొంటారా? అనేదే సందేహం!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -