Saturday, May 4, 2024
- Advertisement -

తెలంగాణ ఉద్యమకారుడి ఆత్మహత్య

- Advertisement -

నల్లగొండ జిల్లాలో తెలంగాణ ఉద్యమకారుడు బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు. కష్టాల్లో ఉన్న ఉద్యమకారుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ.. ఆయన రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. 

నల్గొండ జిల్లా భువనగిరిలో తెలంగాణ ఉద్యమకారుడు జక్కుల యాకస్వామి రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకున్నాడు. తెలంగాణ మలి ఉద్యమంలో యాకస్వామి కీలకంగా పాల్గొన్నాడు. మిలియన్‌ మార్చ్‌ సందర్భంగా పోలీసుల లాఠీచార్జిలో రామస్వామి వెన్నెముకకు తీవ్రగాయమైంది. అప్పటి నుంచి యాకస్వామి మంచానికే పరిమితమయ్యారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి తోడ్పాటు అందకపోవడంతో కలత చెందిన యాకస్వామి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

ఓవైపు తెలంగాణ సాధనలో అవిశ్రాంత పోరాటం చేసి అలసిన ఉద్యమకారుడు.. తెలంగాణ సర్కారు నిర్లక్ష్యానికి ఆత్మ బలిదానం చేసుకోగా.. అదే సమయంలో.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ.. తెలంగాణ అమరవీరుల స్తూపానికి నివాళులు సమర్పించడం గమనార్హం. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -