Sunday, April 28, 2024
- Advertisement -

స్టీజీమీద సిల్లీగా కొట్టుకున్న కాంగ్రెస్ నేత‌లు…

- Advertisement -

తెలంగాణలో ఇంటర్ విద్యార్థులకు న్యాయం చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఇందిరాపార్క్ వద్ద చేపట్టిన దీక్షా కార్యక్రమం రసాభాసగా మారింది. విద్యార్థుల‌కు న్యాయం చేయాల‌ని పోరాటానికి దిగిన నేత‌లతో ప్రాంగ‌నం ర‌సాభాస అయ్యింది. వేదిక‌మీద‌నె ఇద్ద‌రు సీనియ‌ర్ కాంగ్రెస్ నేత‌లు చిన్న‌పిల్ల‌ల్లాగా సిల్లీగా కొట్టుకున్నారు. దీంతో అక్క‌డున్న వారంతా అవాక్య‌య్యారు.

వేదిక మీద కుర్చీలో కూర్చునే విషయంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత హనుమంతరావు, ఆ పార్టీ అధికార ప్రతినిధి నగేశ్‌ మధ్య గొడవ జరిగింది.వీహెచ్‌, నగేశ్‌ వేదిక మీదే పరస్పరం బాహాబాహీకి దిగారు. పరస్పరం తోసుకుంటూ కింద పడ్డారు. దీంతో ఆగ్రహానికి లోనైన హనుమంతరావు నగేశ్‌పై చేయిచేసుకున్నారు. దీంతో కాసేపు గందరగోళ వాతావరణం నెలకొంది.

దీక్షాస్థలిలో వీహెచ్ కు కేటాయించిన కుర్చీని నగేశ్ తెలంగాణ కాంగ్రెస్ ఇన్ చార్జ్ కుంతియాకు ఇచ్చేయ‌డంతో వీహెచ్ స‌హ‌నం కోల్పోయారు. నా కుర్చీని ఎలా తీసుకుంటావంటూ అక్కడ వీహెచ్ వీరంగం సృష్టించాడు.ఉదయం గాంధీభవన్‌లో జరిగిన సమావేశంలోనూ పార్టీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సమావేశం నుంచి అర్ధాంతరంగా వెళ్లిపోయిన ఆయ‌న డైరెక్టుగా వామ‌ప‌క్షాలు ఇందిరాపార్క్ వ‌ద్ద చేస్తున్న ధ‌ర్నాకు వ‌చ్చారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -