గజ్వేల్ మండలం రిమ్మనగూడ వద్ద రాజీవ్ రహదారిపై ఘోర ప్రమాదం సంభవించింది. ఆర్టీసీ బస్సు, కంటెయినర్, లారీ, క్వాలిస్ వాహనాలు ఒకదాన్ని మరోటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పది మంది మృతి చెందారు. 30 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. వారిలో కొదరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మంచిర్యాల డిపోకు చెందిన రాజధాని బస్సును లారీ ఢీకొట్టడంతో బస్సు బోల్తా పడింది.
మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు, వైద్యసిబ్బంది, స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యల్లో పాల్గొన్నారు. గాయపడ్డవారిని హైదరాబాద్లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరి కొంత మందిని గజ్వేల్ ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.
ఈ ప్రమాదంతో స్థానికంగా విషాదం అలుముకుంది. గాయపడినవారు పెద్దసంఖ్యలో ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని భావిస్తున్నారు.