- Advertisement -
ఫ్రీ బస్ ఎఫెక్ట్.. మరోసారి బస్ చార్జీలు పెంచనుంది తెలంగాణ ఆర్టీసీ. ఫ్రీ బస్సు భారం ప్రజలపై మోపేందుకు సిద్ధమైంది కాంగ్రెస్ ప్రభుత్వం. హైదరాబాద్ నగరంలోని సిటీ బస్సులు చార్జీలను పెంచనున్నట్లు ప్రకటించింది ఆర్టీసీ సంస్థ.
ఆర్డినరీ బస్సులో 1 నుండి 3 స్టాపుల వరకు రూ.5 పెరగనుండగా 4 స్టాపుల తరువాత రూ.10 పెంచుతున్నట్లు ప్రకటించింది. డీలక్స్ లేదా ఏసీ బస్సుల్లో మొదటి స్టాప్ వరకు రూ.5, రెండవ స్టాప్ నుండి రూ.10 పెంచేందుకు ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది.
పెరిగిన ధరలు అక్టోబర్ 6వ తేదీ నుండి అమలులోకి వస్తాయని వెల్లడించింది తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం.
