Saturday, April 27, 2024
- Advertisement -

అయోధ్య పేరుతో దొంగ విరాళాలు..!

- Advertisement -

అయోధ్యలో రామమందిర నిర్మాణానికి అక్రమంగా విరాళాలు వసూలు చేస్తున్న వ్యక్తిపై ఉత్తర్​ప్రదేశ్​ పోలీసులు కేసు నమోదు చేశారు. మొరాదాబాద్​ జిల్లా భాజపా అధ్యక్షుడు రాజ్​పాల్ సింగ్​​ చౌహాన్​ ఫిర్యాదు మేరకు ఈ మోసానికి పాల్పడుతున్న వ్యక్తిని గుర్తించారు.

మందిర నిర్మాణం పేరిట సామాజిక మాధ్యమాలు, ఇంటింటి ప్రచారం ద్వారా విరాళాలు సేకరిస్తున్న వ్యక్తిని ప్రేమ్​వీర్​ సింగ్​గా గుర్తించామని మజోలా పోలీసు స్టేషన్​ అధికారి అవధేశ్​ కుమార్​ తెలిపారు. ఐపీసీ 419తో పాటు ఐటీ చట్టం(ఫోర్జరీ) కింద కేసు నమోదు చేశామని వివరించారు.

ప్రేమ్​వీర్​ సింగ్​ సామాజిక ఖాతాలను పరిశీలించిన పోలీసులు విశ్వ హిందూ మహాశక్తి సంఘ్​కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. అతడికి విరాళాలిచ్చిన దాతల వివరాలను సైతం సేకరించామని, త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -