Sunday, May 19, 2024
- Advertisement -

ఇందుకు కదా.. పవన్ ను అందరూ విమర్శించేది!

- Advertisement -

ఏపీకి ప్రత్యేక హోదా అంశం గురించి ఒక యువకుడు ఆత్మహత్యాయత్నం చేసేంత వరకూ వచ్చింది పరిస్థితి. రాష్ట్ర విభజన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోకకపోవడంతో ఈ పరిస్థితి దాపురించింది.

ఏపీకి ప్రత్యేకహోదా అంశం గురించి ప్రజలు తీవ్రంగా మదనపడుతున్నారు. ప్రత్యేక హోదా దక్కితే తప్ప రాష్ట్ర అభివృద్ధి సాధ్యం కాదని వారు నమ్ముతున్నారు. ఈ విషయంలో కేంద్రంలోఅధికారంలోకి వచ్చిన బీజేపీ ఏపీని మోసం చేస్తోందనే అభిప్రాయాలే కలుగుతున్నాయి.

ఎన్నికల ముందేమో ఏపీకి ఎన్నో సంవత్సరాల పాటు ప్రత్యక హోదాను కల్పిస్తామని కమలనాథులు ప్రకటించారు. అప్పట్లో వెంకయ్య నాయుడు ఈ అంశం గురించి చేసిన ప్రకటనలను ఎవరూ అంత సులభంగా మరిచిపోలేరు. అయితే ఇప్పుడు మాత్రం బీజేపీ వాళ్లు అవేమీ గుర్తులేనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇక కేంద్రంతో సంబంధాలు చెడిపోవడం ఏమాత్రం ఇష్టం లేని.. బీజేపీతో తాము సఖ్యతగా మెలగాల్సిందే అని భావిస్తున్న చంద్రబాబు నాయుడు ఈ అంశం గురించి ఇప్పటి వరకూ సరిగా స్పందించిన దాఖలాలు లేకుండా పోయాయి.

మరి ఇప్పుడు పవన్ కల్యాణ్ ఏం చేస్తున్నాడు? అనే ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతోంది. ఎన్నికల ముందు ఎన్నో కబుర్లు చెప్పి వెళ్లి.. ఈ ప్రభుత్వాలు మాట తప్పితే ప్రశ్నిస్తానని చెప్పి వెళ్లిన పవన్ ఇప్పటి వరకూ సరిగా స్పందించలేదు. అప్పుడప్పుడు ట్విటర్ ద్వారా ఏదో ఒక కామెంట్ లు చేయడమే కానీ.. ఆ విధంగా కూడా సరైన రీతిలో స్పందించలేదు. ఇప్పుడేమో ప్రత్యక హోదా అంశం గురించి ఆత్మహత్యలు నమోదవుతున్నాయి. ఇప్పటి వరకూ జనసేనాని ఆ అంశం గురించి స్పందించలేదు. మరి ఇందుకు కదా.. పవన్ పై విమర్శలు వచ్చేది?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -