ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా తీసుకరవాడానికి జనసేన పారూ అధినేత పవన్ కళ్యాణ్ చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ప్రత్యేక హోదా కోసం రాజకీయ పార్టీలకు అతీతంగా ఆంధ్ర యువత ముందుకు వస్తున్నారు. తమ మటాలను కేంద్రానికి వినిపించేందుకు సిద్దమైయ్యారు. జనవరి 26న విశాఖ ఆర్కే బీచ్లో ప్రత్యేక హోదా సాధన కోసం మౌన ప్రదర్శన నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ మౌన ప్రదర్శన జనసేన పార్టీ పూర్తి మద్దతు తెలిపింది.
పవన్ కళ్యాణ్ దేశ్ బచావ్ అంటూ పాటలను కూడా విడుదల చేసి యువతలో చైతన్యం కలిగించారు. ఈ పీస్ ర్యాలీ కి సినీ తారలు కూడా మద్దుతు ఇస్తున్నారు. మెగా బ్రదర్ నాగబాబు శాంతి ప్రదర్శనకు సపోర్ట్ చేస్తున్నట్లు వీడియో ద్వారా తెలిపారు. అలాగే హీరో రాజ్ తరుణ్, సంపూర్ణేష్ వంటి చిన్న హీరోలు కూడా విశాఖ ఆర్కే బీచ్లో మౌన ప్రదర్శన వద్దకు వెళ్ళడానికి రెడీ అయ్యారు. సినీ తారలు హైదరాబాద్ నుంచి విశాఖ ఆర్కే బీచ్కు వెళ్లేందుకు కొన్ని సంస్థలు స్పెషల్ బస్సులను ఉచితంగా ఏర్పాటు చేస్తున్నాయి.
చైన్నై లో జల్లికట్టు ఉద్యమానికి కోలీవుడ్ పూర్తిగా మద్దతు తెలపడంతో ఆ స్పూర్తితో .. టాలీవుడ్ ప్రత్యేక హోదా కోసం ఒకటవుతోంది. జల్లికట్టుకి, ప్రత్యేక హోదాపై లింక్ ఏమిటి అని కొంతమంది రాజకీయ నాయకులు విమర్శిస్తే.. దానికి కొన్ని నిముషాల క్రితం పవన్ కళ్యాణ్ గట్టిగా సమాధానం చెప్పారు. “జల్లికట్టుకి ,హోదాకి లింకు ఏమిటి?అన్న ప్రశ్నకు-ఒక సాంప్రదాయం కోసం తమిళులు అంత పోరాటం చేస్తున్నప్పడు, మన అవసరాలు కోసం ఇంకెంత పోరాటం చెయ్యాలి” అటూ ట్వీట్ చేశారు.
Related