Sunday, May 12, 2024
- Advertisement -

పోటీ సరే.. పరువును పోగొట్టుకొనేది ఎవరు..!

- Advertisement -

తమకు దక్కనిదాని కోసం ఆరాట పడి.. అది అందక తెలంగాణ రాష్ట్ర సమితి పరువు పోగొట్టుకొంటుందా?! లేక తమకు న్యాయంగా దక్కాల్సిన దాన్ని కూడా అందుకోలేక తెలుగుదేశం అభాసుపాలవుతుందా? ఈ  రెండు పార్టీల్లో పరువును పోగొట్టుకొనేది ఎవరు?!
పరువును నిలుపుకొని..గర్వంగా తల ఎగరేసేది ఎవరు?! అనేది ఆసక్తికరంగా మారిందిప్పుడు.

తెలంగాణ రాష్ట్ర శాసనమండలి ఎన్నికల్లో ఐదో అభ్యర్థిని నిలబెడుతోంది టీఆర్ఎస్. ఈ పార్టీకి వాస్తవంగా దక్కేది నాలుగు ఎమ్మెల్సీ సీట్లే అయినా.. ఐదో అభ్యర్థిని నిలబెడుతోంది తెరాస. ఈ ఐదో అభ్యర్థి ద్వారా ఆ పార్టీ తెలుగుదేశం అవకాశాలను దెబ్బ కొట్టాలని భావిస్తోంది. టీడీపీని చావు దెబ్బతీయాలని అనుకొంటోంది!

మరి ఇప్పుడు గనుక తెరాస గెలిస్తే.. అది తెలుగుదేశానికి చాలా ఇబ్బందికరమైన పరిణామామే. తమకు దక్కాల్సిన సీటును తెదేపా నిలుపుకోలేకపోయినట్టవుతుంది. ఎమ్మెల్యేలను పార్టీ గీత దాటకుండా నిలుపుకోలేక తెలుగుదేశం అలాంటి ఓటమిని మూటగట్టుకొన్నట్టవుతుంది. ఇక ఈ ప్రయత్నంలో విఫలం అయితే తెరాసకు అంతకుమించిన అవమానం ఉండదు. తమ వాస్తవ బలానికి అనుగుణంగా పనిచేసుకోకుండా..ఐదో అభ్యర్థిని నిలిపి.. తెరాస గనుక ఓడిపోతే.. అది పెద్ద అవమానమే! మరి ఈ అవమానం ఎదురయితే.. తెరాస కు తల ఎక్కడ పెట్టుకోవాలో కూడా అర్థం కాకపోవచ్చు. మరి ఈ వ్యవహారం ఎలా ముగుస్తుందో!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -