Wednesday, May 8, 2024
- Advertisement -

ప్ర‌మాణ‌స్వీకారం చేసిన ముగ్గురు టీఆర్ఎస్ ఎంపీలు

- Advertisement -

తెలంగాణ నుంచి మూడు రాజ్య‌స‌భ స్థానాలు కాగా ఆ మూడు కూడా టీఆర్ఎస్ ద‌క్కించుకుంది. ఎన్నిక‌లు అనివార్యం కావ‌డంతో జ‌రిగిన ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ అభ్య‌ర్థులుగా పోటీ చేసిన జోగినపల్లి సంతోశ్‌కుమార్, బండా ప్రకాశ్ ముదిరాజ్‌, లింగయ్య యాదవ్ గెలుపొందారు. రాజ్యసభ ఎన్నికల్లో వీరు ముగ్గురు గెలుపొందడంతో బుధ‌వారం (ఏప్రిల్ 4) పార్ల‌మెంట్‌లో ప్ర‌మాణ‌స్వీకారం చేశారు.

రాజ్యసభ సభ్యులుగా సభలో ప్రమాణ స్వీకారం చేసిన వీరికి ప‌లువురు అభినంద‌న‌లు తెలిపారు. గులాబీ కండువాలు ధరించిన ముగ్గురు స‌భ్యులు సంద‌డి చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు నమస్కరించి కరచాలనం చేశారు. వీరికి ప‌లువురు ప్ర‌ముఖులు శుభాకాంక్ష‌లు తెలిపారు. వీరి వెంట టీఆర్ఎస్ ఎంపీలు, నాయ‌కులు ఉన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -