- పోలీసుల అదుపులో ఇద్దరు
తెలుగు బుల్లితెరకు చెందిన ఓ ప్రముఖ నటి వ్యభిచారంలో పోలీసులకు పట్టుబడింది. అంతేకాక ఆన్లైన్లో వ్యభిచారం బిజినెస్ నిర్వహిస్తున్న వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం తెలుగు బుల్లి పరిశ్రమకు షాక్ ఇచ్చింది. ఆమె ఎవరు? ఎవరెవరు పట్టుబడ్డారో తెలియడం లేదు. ప్రస్తుతానికి ఇద్దరు పోలీసుల అదుపులో ఉన్నారు.
కృష్ణానగర్కు చెందిన సోయల్, రెడ్డి నరేశ్ అనే ఇద్దరు ఆన్లైన్ వ్యభిచారం బిజినెస్ చేస్తున్నారు. ఆన్లైన్లో అమ్మాయిల వివరాలు పెట్టి ఆర్డర్ల కోసం ఎదురుచూస్తున్నారు. వీరితో ఓ బుల్లితెర నటి ఒప్పందం చేసుకుంది. దీంతో ఓ వ్యక్తి ఆన్లైన్లో ఆమెను ఎంచుకొని రమ్మన్నాడు. ఆమె ఉప్పల్లోని ప్రశాంతనగర్కు బుక్ చేసుకున్న వ్యక్తి వద్దకు వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న ఉప్పల్ పోలీసులు నటిని, ఆమె వెంట వెళ్లిన రెడ్డి నరేశ్ను పట్టుకున్నారు. వీరిద్దరినీ అదుపులోకి తీసుకుని పోలీసులు కేసు నమోదు చేశారు.
కాగా తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన వారు పోలీసులకు పట్టుబడడం ఇదేమీ మొదటి సారి కాదు. గతంలో ఎంతోమంది పట్టుబడ్డారు. కానీ వారి వివరాలు ఏమీ బయటకు రాలేదు. ఇప్పుడు ఇమె పట్టుబడింది కానీ వివరాలు తెలియరాలేదు. అవకాశాల లేక.. ఆర్థికంగా నష్టపోతుండడంతో ఆ పనికి పాల్పడ్డట్లు తెలుస్తోంది.