- Advertisement -
ప్రముఖ చానెల్లో పనిచేస్తున్న యాంకర్ సోమవారం ఉదయం ఆత్మహత్య చేసుకుంది.పూర్తి వివరాలలోకి వెళ్తే..విజయవాడకు చెందిన తేజశ్విని ఓ ప్రముఖ చానెల్లో యాంకర్గా పనిచేస్తుంది.రెండేళ్ల క్రితమే తేజశ్విని ప్రేమ వివాహం చేసుకుంది.శనివారం రాత్రి తేజశ్విని అత్త అన్నపూర్ణాదేవితో గొడవ పడింది. అనంతరం తన గదిలోకి వెళ్లి ఫ్యాన్ కి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.
ఎంతకీ తేజశ్విని గదిలోనుంచి బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన అత్త గది వద్దకు వెళ్లి చూసింది. ఉరేసుకుని కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించింది. తరచూ గొడవల నేపథ్యంలో మనస్థాపం చెందిన తేజశ్విని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.