Thursday, May 16, 2024
- Advertisement -

చంద్రబాబు కి ఆమె హ్యాండ్ ఇచ్చింది

- Advertisement -

తెలంగాణా టీడీపీ ఇప్పటికే దాదాపు ఖాళీ అవ్వగా మిగిలిన వాళ్ళు కూడా ఇప్పుడు బట్టలు సర్దేస్తున్నారు. ఇప్పటి వరకూ చాలా మంది నేతలు ఒక్కరోక్కరు గా చంద్రబాబు కి గుడ్ బై చెప్పేసారు. వారి వరస లో చేరిపోయారు ఉమా మాధవ రెడ్డి. ఈమె చంద్రబాబు హయాం లో చంద్రబాబు కి చాలా నమ్మిన బంటుగా ఉండేవారు.

భర్త ఎలిమినేటి మాధవరెడ్డి టీడీపీ ప్రభుత్వం లో హోమ శాఖ మంత్రిగా పని చేసారు. ఆయన హోం మంత్రిగా ఉన్నప్పుడు నక్సల్స్ జరిపిన దాడిలో 2000 సంవత్సరంలో హఠాన్మరణం చెందడంతో ఆయన భార్యగా ఉమా రాజకీయ అరంగేట్రం చేశారు. దీంతో చంద్రబాబు ఆమెకు కేబినెట్ లో మంత్రి పదవి కూడా ఇచ్చారు. నల్లగొండ టీడీపీ రాజకీయాల్లో తమకంటూ ప్రత్యేక గుర్తింపు పొందడమే కాకుండా భువనగిరిలో ఎలిమినేటికి ఎదురులేదనే మాట కూడా పొందారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో తెలంగాణలో టీడీపీ అస్థిత్వమే ప్రశ్నార్థకంగా మారింది.

దీంతో ఉమా మాధవ రెడ్డిని పట్టించుకునే నాథుడు టీడీపీలో కరువయ్యారు. దీంతో గత కొన్నాళ్లుగా స్తబ్దుగా ఉన్న ఉమా.. టీ టీడీపీలో తనకు భవిష్యత్తు లేదని పార్టీ మారటమే ఉత్తమమని అని డిసైడయ్యారట. అయితే టీఆర్ ఎస్ వైపు చూసినా.. అక్కడి నుంచి ఎలాంటి సిగ్నల్స్ రాకపోవడం పైగా నల్లగొండలో టీఆర్ ఎస్ కు నాయకులు చెట్టుకొకరు పుట్టకొకరుగా ఉండడంతో ఇప్పుడు ఆమె చూపు హస్తం నేతల వైపు మళ్లిందని సమాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -