- Advertisement -
ఈ మద్య రాజకీయ నేతల ఇంట వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఇంట విషాదం నెలకొంది. ఆయన పెద్దన్నయ్య యాదగిరిరెడ్డి అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నాడు. పరిస్థితి విషమించడంతో రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.
తన సోదరుడు మరణ విషయం తెలియగానే వెంటనే తిమ్మాపూర్ చేరుకున్నారు మంత్రి కిషన్ రెడ్డి. యాదగిరిరెడ్డి మృతి విషయం తెలిసిన పలువురు నేతలు కిషన్రెడ్డిని పరామర్శించారు. నేడు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.