ప్రధానమంత్రిగా మోదీ అధికారంలోకి వచ్చిన కొన్ని రోజులకే స్వచ్ఛభారత్ పేరుతో మోడీ చేస్తున్న కృషి తెలిసిందే. ఆయన మానసపుత్రిక అయిన స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. విషయంలో మోడీ ఇచ్చే ప్రాధాన్యత చాలా ఎక్కువ.
కాని సొంత మంత్రులే స్వచ్ఛభారత్కు తూట్లు పొడుస్తున్నారు.’స్వచ్ఛ భారత్’ పేరుతో ఏకంగా, జనం మీద పన్నుల బాదుడు కూడా బాదేసింది నరేంద్రమోడీ సర్కార్.
ఇదిగో, ఫొటోలో ఎంచక్కా సెక్యూరిటీ సిబ్బందిని కాపలా పెట్టుకుని మరీ, ‘గోడని తడిపే’ కార్యక్రమం చేపట్టిందెవరో తెలుసా.? ఇంకెవరు, నరేంద్రమోడీగారి క్యాబినెట్లో పనిచేస్తోన్న కేంద్ర మంత్రి రాధా మోహన్ సింగ్. బీహార్లోని మోతీహరి ప్రాంతంలో పర్యటిస్తున్న సందర్భంలో రాధామోహన్సింగ్, ఇలా నిస్సిగ్గుగా బహిరంగ మూత్ర విసర్జన చేసేసి, కెమెరాకి చిక్కేశారు.ఇది ఇప్పుడు వైరల్గా మారడంతో భాజాపాకు చిక్కులు తప్పేట్లులేవు.
{loadmodule mod_custom,GA1}
స్వచ్చ భారత్ నినాదంతో, సినీ ప్రముఖుల ద్వారా దేశమంతటా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం విదితమే. ‘బహిరంగ మల మూత్ర విసర్జన సిగ్గు సిగ్గు..’ అంటూ ఆ ప్రకటనల్లో పేర్కొంటున్నారు. సాక్షాత్తు కేంద్రమంత్రే ఇలా అడ్డంగా బుక్ అవ్వడంతో ఇలాంటోళ్ళు కేంద్ర మంత్రులుగా వుండడం దేశ ప్రజల దౌర్భాగ్యమనే అనుకోవాలి.
ఓపక్క స్వచ్ఛభారత్ అంటూ ప్రధాని మోడీ కిందామీదా పడుతుంటే.. మరోవైపు ఆయన మంత్రివర్గంలోని వారు.. సొంత పార్టీ నేతలు ప్రధాని స్ఫూర్తిని దెబ్బతీసేలా వ్యవహరించటం చర్చనీయాంశంగా మారింది. ఈ ఫొటో చూశాక నరేంద్రమోడీ, సదరు కేంద్ర మంత్రిగారిని పదవి నుంచి పీకేస్తారా.? జస్ట్ ఓ క్షమాపణతో కేంద్ర మంత్రిగారు వివాదం నుంచి బయటపడతారా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
{loadmodule mod_sp_social,Follow Us}
{youtube}sL4nrFh894w{/youtube}