Friday, April 26, 2024
- Advertisement -

ఎదురుగా తల్లి శవం – ఆస్తి గొడవలు – అంత్య క్రియలు లేవు !

- Advertisement -

 

Unseen Incident in Mahabubnagar Dist

డబ్బు మానవత్వం ముసుగుని కమ్మేస్తూ వస్తోంది .. మానవత్వం లేని తరం వైపు మనుషులు తమని తాము లాక్కుపోతున్నారు. మొన్నటికి మొన్న ఒక వ్యక్తి ఆమె భార్య మృతదేహం స్మశాన వాటిక లో పూడ్చడం కోసం 10 కిలోమీటర్ లు నడిచిన తరుణం మరువక ముందరే ఒక మహిళ మృతదేహం ఖననం చెయ్యడం కోసం ఆస్తి గొడవలు అడ్డం వచ్చాయి.

తెలంగాణా లోని మహబూబాబాద్ లో జరిగిన ఈ ఘటన షాకింగ్ గ ఉంది. దంతాల పల్లి మండలానికి చెందిన కోరిపెల్లి సురేష్ రెడ్డి ఆరోగ్యం , మానసిక స్థితి సరిగ్గా లేదు. దీంతో అతని భార్య సునీత తన కొడుకు అచ్యుత్ ని తీసుకుని పుట్టింటికి వచ్చేసింది. ఈ క్రమం లో అనారోగ్యం తో మూడు రోజుల క్రితం ఆమె చనిపోయింది. ఆమె మృతదేహం అత్తగారి ఇంటికి తరలించిన బంధువులు నరేష్ ఆస్తి కుమారుడు అచ్యుత్ కి రాయాలి అంటూ , అప్పటి దాకా అంత్య క్రియలు జరగవు అంటూ డిమాండ్ చేసారు.

నరేష్ సోదరుడు ఈ విషయం లో కల్పించుకుని, తన వదిన తన అన్నని వదిలి వెళ్ళిపోయింది కాబట్టి ఆస్తి లో వాటా ఆ పిల్లాడికి చెందే పరిస్థితి లేదు అని కూర్చున్నాడు. అలా ఒకరిమీద ఒకరు వాదాలు ఆడుకుంటూ టైం అంతా వేస్ట్ చేసారు. శవం మాత్రం నరేష్ రెడ్డి ఇంటి దగ్గరే ఉంచేశారు. ఇంటిదగ్గర వారు అచ్యుత్ కి అన్నం పెడుతున్నారు .. ఆ బాబు ఏడుపు చూసి చుట్టుపక్కలవారి కళ్ళలో నీళ్ళు ఆగడం లేదు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -