ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోవడంతో దాని ప్రభావం పార్టీపై చూపుతోంది. మరో వైపు భాజాపా అకర్ష్ దెబ్బకు పార్టీ కుదేలవుతోంది. ఇప్పటికే నలుగురు రాజ్యసభ సభ్యుల కాషాయ కండువా కప్పుకున్నారు. మరి కొంత మంది నేతలు కమలం గూటికి చేరేందుకు రెడీ అవుతున్నారు. టీడీపీకీ భవిష్యత్తు ఉండదని ఇప్పటి నుంచె తమ రాజకీయ భవిష్యత్తుకోసం ఇతర పార్టీల్లోకి వెల్తున్నారు. పార్టీ మారుతున్న నేతల్లో అనంతపురం జిల్లాకు చెందిన నేత ముందు వరుసలో ఉన్నారంట. త్వరలోనె ఆయన పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరుతున్నారనె వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అనంతపురం జిల్లాలోని ఉరవకొండలో టిడిపి తరపున గెలిచిన పయ్యావుల కేశవ్ తొందరలో టిడిపికి రాజీనామా చేయాలని డిసైడ్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పయ్యావుల గెలిస్తే రాష్ట్రం మొత్తం మీద టిడిపి ఓడిపోతుందని… అలాగే పయ్యావుల ఓడితేనే టిడిపి అధికారంలోకి వస్తుందని టిడిపి నేతలు చేస్తున్న వ్యాఖ్యలు పయ్యావలకు ఇబ్బందికరంగా ఉన్నాయంట. దీంతో పయ్యావుల ఇప్పటి వరకూ అధికారపార్టీ ఎంఎల్ఏ అనిపించుకోలేదని తెగ ఫీలైపోతున్నారట. దాంతో పాటు మొన్నటి వైసిపి దెబ్బకు టిడిపికి భవిష్యత్ కష్టమే అని మద్దతుదారులు కూడా తెగ పోరు పెడుతున్నారట. అందుకే పదవులకు రాజీనామా చేసి వైసీపీలో చేరాలని అనుచరులు ఒత్తిడి చేస్తున్నారంట. మద్దతుదారుల దెబ్బకు పయ్యావుల టిడిపికి రాజీనామా చేసి వైసిపిలో చేరితే అయినా అధికార పార్టీ అనిపించుకోవచ్చని అనుకుంటున్నారట.