Saturday, May 18, 2024
- Advertisement -

అమరావతికి మెట్రో రైలు స‌దుపాయం క‌ల్పిస్తాం:వెంకయ్య

- Advertisement -
Venkaiah Naidu gives Green Signal to Amaravathi Metro Rail

ఏపీ క్యాపిటల్ సీటీ అమరావతిలో రోడ్స్ అండ్ బిల్డింగ్ ప‌నుల‌కు శంకుస్థాప‌న చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ…భార‌త్ అభివృద్ధిలో ఎంతో ముందుకువెళుతోంది అని అన్నారు. అక్కడ నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ‌లో ప్రసంగిస్తూ… ప్ర‌పంచం మొత్తం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కుంటుంటే భార‌త్ మెరుగైన వృద్ధి రేటుతో ఉంద‌ని చెప్పారు.

చరిత్రలో అమ‌రావ‌తికి భూములిచ్చిన రైతుల పేరు నిలిచిపోతుందని అన్నారు. రైతులు రాష్ట్ర‌ బంగారు భవిష్యత్ కోసం భూములు ఇచ్చారని చెప్పారు. కేంద్రం సాయంతో రాష్ట్రంలో నిరంత‌ర విద్యుత్ అందుతుంది. దేశంలో రామ‌రాజ్యం కోసం ప్ర‌ధాని త‌పిస్తున్నారు. కేంద్రంలో స‌రైన దిశ చూపే నాయ‌కులు ఉన్నారని తెలిపారు. అలాగే అమరావతికి మెట్రో రైలు స‌దుపాయం క‌ల్పిస్తాం’ అని వెంకయ్య వ్యాఖ్యానించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -