లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు లండన్ కోర్ట్ బిగ్ షాక్ ఇచ్చింది. బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టి లండన్ లో దర్జాగా గడుపుతున్న మాల్యా త్వరలో భారత్ కు అప్పగించేందుకు మార్గం సుగమం అయ్యింది. భారత్కు రప్పించే చర్యలకు వ్యతిరేకంగా మాల్యా దాఖలు చేసిన పిటిషన్ను లండన్లోని వెస్ట్ మినిస్టర్ కోర్టు సోమవారం తోసిపుచ్చింది. దీంతో మాల్యాను త్వరలోనే దేశానికి తీసుకొచ్చే అవకాశం ఉంది.
విజయ్ మాల్యా 9వేల కోట్ల రూపాయలకు పైగా ప్రభుత్వ బ్యాంకులకు ఎగవేసి, డీఫాల్టర్గా 2016 మార్చిలో దేశం లండన్కు పారిపోయాడు. ఆర్థిక నేరాలకు పాల్పడిన కేసులో విజయ్ మాల్యాను తిరిగి దేశం రప్పించేందుకు కేంద్ర కసరత్తును తీవ్రం చేసింది. మాల్యాను భారత్ కు రప్పించేందుకు ఈడీ, సీబీఐ అధికారులు చాలా కాలంగా బ్రిటన్ లో మకాం వేశారు. ఈడీ, సీబీఐ అధికారులు అందజేసిన సాక్ష్యాధారాలను పరిశీలించిన కోర్టు విజయ్ మాల్యాను అప్పగించడం తప్పనిసరని భావించింది. ఇది భారత దర్యాప్తు సంస్థల అధికారులకు పెద్ద విజయంగా చెబుతున్నారు