- Advertisement -
వైఎస్ జగన్, విజయమ్మల జీవితంలో ఈరోజు నిజమైంది. జగన్ ను ముఖ్యమంత్రిగా చూడాలన్న విజయమ్మ చిరకాల వాంఛ నెరవేరిన వేళ ఆమె భావోద్వేగం అందరన్నీ కలచి వేసింది. ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తొలిసంతకం చేసిన తర్వాత ప్రజలకు వరాలజల్లు కురిపించారు.
కుమారుడి ప్రమాణ స్వీకారం సందర్భంగా వేదికమీద అరుదైన సంఘటన చోటు చేసుకుంది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆమె జగన్ ను గుండెలకు హత్తుకుని కన్నీరు మున్నీరైంది. తల్లి హృదయాన్ని అర్థం చేసుకున్న జగన్.. అపురూపంగా ఆమెను ఆలింగనం చేసుకున్నాడు. తల్లి కన్నీరు తుడిచాడు. దీంతో సభలో ఉన్న వారందరూ ఈ దృశ్యం చూసి చలించిపోయారు.కాగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 151 స్థానాలు, 22 ఎంపీ సీట్లను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.