ట్విట్టర్లో చంద్రబాబును టార్గెట్ చేసె వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇప్పుడు టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ను టార్గెట్ చేశారు. గత నాలుగు రోజులనుంచి ట్విట్టర్లో రవిప్రకాశ్పై కామెంట్లతో విరుచుకుపడుతున్నారు. తాజాగా ట్విట్టర్ వేదికగా మరో సారి సెటైర్లు సంధించారు.
టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాశ్ ముందస్తు బెయిల్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కోట్టేసింది. వెంటనె పోలీసుల ఎదుట విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. కోర్టు నిర్ణయంపై విజయసాయి రెడ్డి స్పందించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ ను పెడుతూ, “పోలీసులు వస్తే ఇంట్లో కనిపించడు. నోటీసులకు స్పందించడు. పరారీలో లేనంటాడు. పోలీసులు, చట్టాలు, కోర్టులు తనంతటి ‘ప్రవక్త’ను టచ్ చేయవన్న భ్రమలో ఉన్నాడు. బెయిల్ పిటిషన్ను కోర్టు కొట్టేసింది. తప్పించుకునే దారులన్నీ బంద్. ఇక ఈ ‘మీడియా నయీం’ను ఏ ‘బాబు’ రక్షిస్తాడో చూడాలి” అని వ్యాఖ్యానించారు.
విచారణకు రండి అని పోలీసులు చాలా మర్యాదగా రవిప్రకాష్ ఇంటికి నోటీసులు అంటిస్తుంటే ‘నకిలీ ప్రవక్త’ రాత్రికి రాత్రి దొడ్డి దారిలో గోడ దూకేసి బోర్డర్ దాటేశాడు. రేపో మాపో మాల్యాతో సెల్ఫీ దిగుతూ కనిపించి పట్టుకోండి చూద్దాం అంటాడేమో!’ అని ఆయన ట్విట్ చేశారు.