విశాఖ జిల్లాలోని కె.కోటపాటు మండలం చంద్రయ్యపేటలో విషాదం చోటుచేసుకుంది. ఆర్థిక కష్టాలు తాలలేక ఒకే కుటుంబానికి చెందిన గ్రామానికి చెందిన ఓ కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. ఈ ఘటనలో భర్త, ఇద్దరు పిల్లలు మృతి చెందగా భార్య ప్రాణాపాయ స్థితిలో ఉంది. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.
వివరాల్లోకి వెల్తే….విశాఖలోని కే. కోటపాడు మండలం చంద్రయ్యపేటకు చెందిన లక్ష్మణరావు విశాఖపట్నంలో కోళ్లఫారంలో పనిచేసేందుకు వచ్చారు. లక్ష్మణరావుకు భార్య లక్ష్మి పాటు సిద్ధూ(6), వీణ(3) ఉన్నారు. ఈ క్రమంలో ఆప్పులు ఎక్కువ కావడంతో వచ్చే ఆదాయం అప్పులు తీర్చ డానికి సరిపోకపోవడంతో మనస్థాపానికి గురయ్యి ఆత్మహత్య చేసుకోవాలని వీరు నిర్ణయించుకున్నారు.
అనంతరం భార్య లక్ష్మితో కలిసి చిన్నారులకు పురుగుల మందు తాగించాడు. ఆతర్వాత భార్యతో కలిసి తానూ తాగాడు. ఘటనలో చిన్న, చింటూ, వీణలు అక్కడికక్కడే మృతి చెందగా చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న భార్యను స్థానిక ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం అక్కడినుంచి విశాఖపట్నం తరలించారు