చిత్తూరు జిల్లా మదనపల్లెలో జరిగిన అక్కాచెల్లెళ్ల జంట హత్యల కేసు రాష్ట్రంలో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. తన కూతుళ్లు చనిపోలేదని ఇంకా బతికే ఉన్నారని మృతుల తల్లిదండ్రులు చెప్పడం విశేషం. ఈ కేసులో నిందితులైన తల్లిదండ్రులను ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే జైల్లో కూడా పద్మజ నేను శివున్ని.. అంటూ తన జోలికి ఎవరూ రావొద్దని అంటూ పెద్దగా అరుపులు కేకలు పెట్టడంతో ఆమె మానసిక పరిస్థితి పూర్తిగా దెబ్బతిన్నదని భావిస్తున్నారు.
జైలు సిబ్బందిని అవస్థలకు గురిచేశారు. ఈ నేపథ్యంలో పురుషోత్తం నాయుడు, పద్మజ గురువారం ఉదయం విశాఖలోని మానసిక వైద్యశాలకు చేర్చారు. వారిద్దరినీ క్లోజ్డ్ వార్డులో వేరువేరుగా ఉంచి వైద్యం అందించేందుకు సిబ్బంది ఏర్పాట్లు చేశారు. సెక్యూరిటీ సిబ్బందితో పాటు మహిళా కానిస్టేబుళ్లు పహరాగా ఉంచారు.
అటు పురుషోత్తం నాయుడు మాత్రం కూతుళ్లను తలుచుకుంటూ ఏడుస్తూ గడిపారు. ఆసుపత్రిలో వైద్యం పూర్తయ్యే వరకు మదనపల్లి సబ్జైల్ నుంచి వచ్చిన సిబ్బంది కూడా ఇక్కడే ఉండే అవకాశం ఉంది.