Saturday, May 18, 2024
- Advertisement -

మళ్లీ మండిపడ్డ ఎమ్మెల్సీ సోము

- Advertisement -

తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ మధ్య అంతర్గత పోరు అంతకంతకు పెరుగుతోంది. కేంద్ర ఇచ్చిన నిధులను రాష్ట్రం సరిగా వినియోగించడం లేదని, ఇక్కడి పార్టీని అవమానిస్తున్నారంటూ తెలుగుదేశంపై విరుచుకుపడుతున్న ఆంధ్రప్రదేశ్ బిజెపి నాయకులు టిడిపిపై నేరుగానే విమర్శలు చేస్తున్నారు.

తాజాగా బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు తన అసంత్రప్తిని వెళ్లగక్కారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శిగా ఐ.వై.ఆర్. క్రష్ణారావు ఉన్న సమయంలో కేంద్రం ఇంకుడు గుంతల కోసం 900 కోట్ల రూపాయల నిధులు ఇచ్చిందని, ఆ నిధులను సరిగా వినియోగించలేదని ఆయన మండిపడ్డారు.

ఒక్క గుంటూరు కార్పొరేషన్ లోనే ఇంకుడు గుంతల కోసం ఏడు కోట్ల రూపాయల నిధులున్నా పనులు మాత్రం సరిగా జరగలేదని ఆయన అన్నారు. కేంద్రం ఇచ్చే నిధులు సక్రమంగా వినియోగమవుతున్న దాఖలాలు ఎక్కడా కనిపించడం లేదని ఆయన మండిపడ్డారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -