Friday, May 10, 2024
- Advertisement -

పాఠ‌శాల బ‌స్సును ఢీకొన్న లారీ….

- Advertisement -

వ‌రంగ‌ల్ జిల్లాలోని వర్ధన్నపేట పోలీస్‌స్టేషన్ సమీపంలో రోడ్డు ప్రమాదం సంభవించింది. ట్యాంకర్ లారీ అదుపుతప్పి పాఠశాల బస్సును వెనుకనుంచి ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో 13 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. బాధిత విద్యార్థులను చికిత్స నిమిత్తం వరంగల్ ఆస్పత్రికి తరలించారు.

వీరిలో ముగ్గురి ప‌రిస్థితి విష‌య‌మంగా ఉన్న‌ట్లు స‌మాచారం. విద్యార్థులతో వెళుతున్న అరబిందో హైస్కూల్‌కు చెందిన బస్సును వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో ఘటన సంభవించింది. లారీ బలంగా ఢీకొట్టడంతో బస్సు వెనుక భాగం దెబ్బతింది. దీంతో వెనుక ఉన్న విద్యార్థులు గాయపడ్డారు.

ప్రమాదం జరగ్గానే స్పందించిన స్థానికులు గాయపడిన చిన్నారులను వైద్యం కోసం తరలించారు. ప్రమాదం సమయంలో బస్సులో 40మంది విద్యార్థులు ఉన్నారు. లారీ ఢీ కొట్టడంతో విద్యార్థులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. తీవ్రంగా గాయపడిన విద్యార్థులను వరంగల్‌లోని ఎంజీఎంకు తరలిస్తున్నారు. బస్సు డీసీ తండా నుంచి వర్ధన్నపేటలోని స్కూల్‌కి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -