Saturday, May 18, 2024
- Advertisement -

కొత్త నోట్లు తీసుకున్న వారికి హెచ్చరిక..

- Advertisement -
Warning to those who are having new currency..

హైదరాబాద్: నోట్ల రద్దు నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ప్రజలు కొత్తవి పొందేందుకు బ్యాంకులకు బారులు తీరుతున్నారు. అయితే ఈ కొత్త నోట్లు తీసుకునే వారికి ఓ ముఖ్యమైన హెచ్చరిక.

డబ్బులపై కొందరు సంతకాలు చేయడం, పేర్లు రాయడం, రంగులు పూయడం చేస్తుంటారు. అయితే ఇకపై అటువంటివి జరగకుండా జాగ్రత్తపడాల్సిన అవసరం ఉంది. కొత్తగా విడుదలైన రూ. 500, రూ. 2000 నోట్లకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓ కీలక ప్రకటన చేసింది. కొత్త నోట్లపై ఏ విధమైన రాతలు ఉన్నా అవి చెల్లవంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు అన్ని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేయడంతో బ్యాంకులు ఆ వివరాలు ప్రజలకు తెలిసే విధంగా నోటీసులు, ఫ్లెక్సీలు పెడుతున్నాయి. కొత్త నోట్లపై ఎటువంటి వ్రాతలు ఉన్నా అవి చెల్లని నోట్లుగా పరిగణించడం జరుగుతుందని, గమనించగలరంటూ వివరిస్తున్నారు బ్యాంకర్లు. దీంతో కొత్త నోట్ల విషయంలో ఇకపై అంతా జాగ్రత్త పడాల్సిందే.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -