Saturday, May 11, 2024
- Advertisement -

రామోజీ.. జగన్ కు అప్పటి నుంచే… శ్రేయోభిలాషి!

- Advertisement -

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి, ఈనాడు మీడియా గ్రూప్స్ అధినేత రామోజీరావుల మీటింగ్ ప్రకంపనలు ఇంకా కొనసాగుతున్నాయి.

ఈ మీటింగ్ జరిగి ఇప్పటికే రెండు రోజులు గడిచిపోయినా.. జనాల్లో మాత్రం ఇది ఇంకా హాట్ టాపిక్కే! ఈ మీటింగ్ ఎందుకు జరిగింది? అనేది చాలా మందికి అంతుబట్టని, అర్థం కాని విషయం.మరి ఈ అంశం గురించి లోతుగా పరిశోధిస్తే… రామోజీ, జగన్ ల మధ్య కొంత కాలం నుంచే సన్నిహిత సంబంధాలున్నాయని తెలుస్తోంది.

ఇప్పుడు కాదు.. చాలా కాలం నుంచే జగన్ విషయంలో పాజిటివ్ గా స్పందిస్తున్నాడట రామోజీ. వీరి బంధానికి మొదటి ప్రతీక మంచు మనోజ్ పెళ్లిలో వీరి కలయిక. ఆ సందర్భంగారామోజీ చేసిన వ్యాఖ్యానాలే చాలా ఆసక్తికరం. “ఎండల్లో కూడా చాలా కష్టపడుతున్నారు.. మీకు మంచి భవిష్యత్తు ఉంది.. ఆవేశం తగ్గించుకొంటే మంచిది..” అంటూ రామోజీ జగన్ కు సూచించినట్టుగా తెలుస్తోంది. 

మరి రామోజీ లాంటి వెటరన్ అలాంటి సూచన చేసే సరికి.. ఆయనపై జగన్ కు శత్రుభావం కొంత వరకూ తగ్గినట్టుగా సమాచారం. ఆ తర్వాత, జగన్ భార్య భారతి, రామోజీ కోడలు శైలజ లు బిజినెస్ ఉమన్లుగా సన్నిహితుగా మారడంతో.. వీరి మధ్య దూరం మరింతగా తగ్గినట్టుగా తెలుస్తోంది.  చివరకు ఈ సాన్నిహిత్యమే జగన్, రామోజీ ల మీటింగ్ వరకూ వచ్చిందని సమాచారం. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -