వైఎస్ జగన్ తీసుకుంటున్న నిర్ణయాల వల్లే ఏపీలో తమకు నష్టం వాటిల్లుతోందని.. హిందుత్వ వ్యతిరేక చర్యలకు జగన్ దిగుతున్నాడనే అనుమానాలను కేంద్రంలోని బీజేపీ పెద్దలు వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. అందుకే జగన్ ఇప్పుడు ఫుల్ ఫోకస్ పెట్టి ఆయనపై కూడా బీజేపీ నేతలు విమర్శలకు దిగుతుండడం గమనార్హం.
తాజాగా పురంధేశ్వరి, కన్నా లాంటి సీనియర్లతోపాటు జూనియర్లు కూడా జగన్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దీనికి కారణం జగన్ తీసుకున్న కొన్ని వివాదాస్పద నిర్ణయాలే కారణమట..
తిరుమలలో బ్రేక్ దర్శనాల రద్దు, విశాఖలో అల్లర్లతో చర్చిలకు సెక్యూరిటీ పెంచి పోలీసులతో ఏబీవీపీ, బీజేవైఎం నాయకులను జగన్ ప్రభుత్వం అరెస్ట్ చేయించడం దుమారం రేపింది.
అంతేకాదు.. బీజేపీలోకి గంపగుత్తగా చేరుదామని ఆశించిన టీడీపీ ఎమ్మెల్యేలు ఇప్పుడు మనసు మార్చుకోవడానికి జగన్ నిర్ణయమే కారణమని బీజేపీ భావిస్తోంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాలని జగన్ స్పీకర్ కు సూచించడంతో అనవసరంగా ఎమ్మెల్యే గిరీ పోతుందని టీడీపీ ఎమ్మెల్యేలు వెనక్కితగ్గారు.
ఈ పరిణామాలే ఇప్పుడు బీజేపీకి కంఠగింపుగా మారాయి. అందుకే జగన్ ను టార్గెట్ చేసి బీజేపీ ఇప్పుడు విమర్శలకు దిగుతోందట..