Thursday, May 2, 2024
- Advertisement -

అప్పుడు 5 లక్షలు.. ఇప్పుడు 20 లక్షలు..!

- Advertisement -

జమ్ము కశ్మీర్​ అసెంబ్లీ ఎన్నికల విధుల్లో 18 ఏళ్ల కిందట.. ఉగ్రవాదులతో పోరాడుతూ ప్రాణాలొదిలాడు 45వ బెటాలియన్​కు చెందిన సీఆర్​పీఎఫ్​ జవాన్​ రమేశ్​ కుమార్​. దోడా టౌన్​ హాల్​ ప్రాంతంలో 2002 అక్టోబర్​ 8న ఆయన మరణించాడు. అప్పట్లో రూ. 5 లక్షల ఎక్స్​గ్రేషియా ప్రకటించింది ఎన్నికల సంఘం. కానీ.. ఆ మొత్తం ఆయన కుటుంబానికి చేరలేదు.

హరియాణా భివానీలో నివసించే రమేశ్​ కుమార్​ భార్య ప్రమీలా దేవి.. 2019లో ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. సీఈఓ కార్యాలయంలో పెండింగ్​లో ఉందని అప్పుడు వివరణ ఇచ్చారు. ఆ తర్వాత.. ఆమె మరోసారి ఈ ఆగస్టు 10న సీఈసీ సునీల్​ అరోడాకు ఈ-మెయిల్​ చేసి ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కోరింది.

స్పందించిన అరోడా.. ప్రమీలా దేవికి ఎన్నికల యంత్రాంగం తరఫున క్షమాపణలు చెప్పారు. తన భర్త త్యాగం ఎప్పటికీ గుర్తుంచుకుంటారని భరోసానిచ్చారు. తక్షణమే ఆమెకు.. రూ. 20 లక్షల పరిహారం(2002లో రూ. 5 లక్షలు) చెల్లించాలని కమిషన్​ నిర్ణయించినట్లు స్పష్టం చేశారు. ఆ మొత్తాన్ని ఆమె బ్యాంకు ఖాతాకు బదిలీ చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -