దేశ వ్యాప్తంగా మహిళలు, చిన్నారులపై రోజు రోజుకీ అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వాలు అనేక చట్టాలు చేసినా అవన్నీ కూడా పనికిరాకుండా పోతున్నాయి. రోజు రోజుకీ మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయో తప్ప తగ్గుముఖ పట్టడంలేదు.
క్షణికావేశం, అక్రమసంబంధాలు ఇలాంటి అఘాయిత్యాలకు దారి తీస్తున్నాయి. గతంలో భర్తలు భార్యలను చంపే సంసృతి పోయి ఇప్పుడు భార్యలే తమ సుఖాలకోసం అమాయకులైన భర్తలను పొట్ట పెట్టుకుంటున్నారు. విజయనగరం జిల్లాలో పెళ్లైన పదిరోజులకే భర్తను హత్య చేయించిన సరస్వతి ఘటన జరగకముందే చిత్తూరు జిల్లా బంగారుపల్లెకు చెందిన రమాదేవి కూడా చేరిపోయింది.
క్షణిక సుఖం కోసం ఓ ఆర్ఎంపీ వైద్యుడితో వివాహేతర సంబంధం పెట్టుకున్న రమాదేవి, సమాజంలో మంచి పేరు, ఉపాధ్యాయ ఉద్యోగం ఉన్న భర్త వాసుదేవన్ ను హత్య చేయించి కటకటాల పాలు కావడమే కాకుండా, తన ఇద్దరు బిడ్డలను అనాధలను చేసింది.
మరోవైపు నిక్షేపంలా ఉన్న భార్యా, ఇద్దరు పిల్లలను పరాయి స్త్రీ మోజులో పడి వదిలేసి, ఆమె కోసం హత్యకు తెగబడ్డ ఆర్ఎంపీ వైద్యుడు రమేష్ కూడా జైలు పాలయ్యాడు. వివరాల్లోకి వెల్తే శనివారం నాడు రమేష్ నడుపుతున్న సుమో వాసుదేవన్ ను ఢీ కొట్టగా ఆయన అక్కడికక్కడే మరణించారు. కేసును విచారించిన పోలీసులు, ఇది రోడ్డు ప్రమాదం కాదని, కావాలనే వాహనంతో ఢీకొట్టి హత్య చేశారని, దీని వెనుక పెద్ద కుట్ర జరిగిందని తేల్చారు.
వాసుదేవన్ భార్య రమాదేవికి, వాహనం నడిపిన రమేష్ కు చాలా కాలంగా వివాహేతర బంధం ఉందని తమ విచారణలో తేలినట్టు చౌడేశ్వరి మీడియాకు తెలిపారు. వీరిద్దరి సంబంధం గురించి తెలుసుకున్న వాసుదేవన్ భార్యను, రమేష్ ను హెచ్చరించాడని, అయినా వారు వినలేదని, గడచిన మూడు నెలలుగా ఇద్దరినీ కలుసుకోకుండా కట్టుదిట్టం చేయడంతోనే వారు హత్యకు పథకం వేశారని, అదను చూసి బైక్ పై వెళుతున్న వాసుదేవన్ ను సుమోతో ఢీకొట్టి చంపించాడని పోలీసు అధికారులు తెలిపారు.