Friday, April 19, 2024
- Advertisement -

‘ఎవ‌డు’ సినిమా ఎంత ప‌నిచేసింద‌య్యో

- Advertisement -
  • సినిమాలోని సీన్ మాదిరిగా ఓ హ‌త్య‌…. ప్రియుడితో క‌లిసి ఉండేందుకు ఓ వివాహిత డ్రామా

సినిమాలు ప్ర‌జ‌ల‌ను ప్ర‌భావితం చేస్తాయ‌నేది ఎన్నోసార్లు నిరూపిత‌మైంది. సినిమాలకు, ప్ర‌జ‌ల‌కు మ‌ధ్య అవినాభావ సంబంధం ఉంటుంది. సినిమాలు మానవులు జీవితాల‌ను చాలా ప్ర‌భావితం చేస్తాయి. దానికి నిద‌ర్శ‌నంగా మ‌రో ఘ‌ట‌న జ‌రిగింది. ఎవ‌డు సినిమాలో అల్లు అర్జున్ ప్రాణాపాయ స్థితిలో బ‌తికి ఉండి శ‌రీరం మొత్తం గాయాల‌పాల‌వుతాడు. ఆ స‌మ‌యంలో జ‌య‌సుధ అల్లు అర్జున్ బాడీకి రామ్‌చ‌ర‌ణ్ ముఖాన్ని అమ‌ర్చుతుంది. ఈ విధంగా ఎవ‌డు సినిమా ఉంది.

దీన్ని ఆద‌ర్శంగా తీస్కొని ఓ మ‌హిళ తన వివాహేత‌ర సంబంధానికి అడ్డుగా ఉన్న భ‌ర్త‌ను తొల‌గించాల‌నుకుంది. భ‌ర్తను చంపి త‌న ప్రియుడుతో క‌లిసి ఉండాల‌ని నిశ్చ‌యించుకుంది. భ‌ర్త, ప్రియుడు ఒకే తీరుగా ఉండ‌డంతో ఇదే అదునుగా భ‌ర్త‌ను చంపేయాల‌నుకుంది.

మ‌హబూబ్‌న‌గ‌ర్‌లోని నాగార్‌క‌ర్నూల్‌కు చెందిన స్వాతి, సుధాక‌ర్‌రెడ్డి భార్యాభ‌ర్త‌లు. ఆరోగ్య స‌మ‌స్య‌పై ఫిజియోథెరపిస్ట్ రాజేశ్ వ‌ద్ద‌కు వెళ్లారు. ఆ క్ర‌మంలో స్వాతికి రాజేశ్‌కు మ‌ధ్య బంధం ఏర్ప‌డింది. వీరిద్ద‌రి మ‌ధ్య వివాహేత‌ర సంబంధం ఏర్ప‌డింది. ఈ విష‌యం క‌ట్టుకున్న భ‌ర్త‌కు తెలిసింది. దీంతో నిల‌దీసి వారించాడు. అయినా విన‌ని భార్య అత‌డితో బంధాన్ని కొన‌సాగిస్తోంది. క‌ళ్లారా చూసిన భ‌ర్త ఆమెను చెడామాడ తిట్టేసి ఇంకోసారి చేస్తే బాగుండ‌ద‌ని హెచ్చ‌రించాడు. ఇక త‌న భ‌ర్త‌ను ఎలాగైనా వ‌దిలిచ్చుకోవాల‌ని భార్య ఓ ప్లాన్ వేసింది.

సుధాక‌ర్‌రెడ్డి, రాజేశ్ ఇద్ద‌రి ప‌ర్స‌నాలిటీ సేమ్ ఉండ‌డంతో భ‌ర్త‌ను చంపేద్దామ‌ని నిశ్చ‌యించుకుంది. భ‌ర్త‌ను హ‌త్య‌మార్చింది. ఆ త‌ర్వాత ప్రియుడు రాజేశ్‌ను త‌న భ‌ర్త సుధాక‌ర్‌రెడ్డిలాగా న‌మ్మించేందుకు రాజేశ్‌పై యాసిడ్ దాడికి పాల్ప‌డింది. ఆ వెంట‌నే త‌న భ‌ర్తను ఎవ‌రో యాసిడ్ దాడి చేశార‌ని వాపోతూ ఆస్ప‌త్రిలో చేర్పించింది. భ‌ర్త సుధాక‌ర్‌రెడ్డి స్థానంలో రాజేశ్‌ను ఉంచి న‌మ్మించింది. ముఖం కాలిపోవ‌డంతో కుటుంబ‌స‌భ్యులంద‌రూ సుధాక‌ర్‌రెడ్డిగా భావిస్తున్నారు. రాజేశ్‌ను సుధాక‌ర్‌రెడ్డిగా న‌మ్మిస్తూనే ఉండిపోయింది.

కొన్నాళ్ల‌కు కుటుంబ‌స‌భ్యుల‌కు అనుమానం వ‌చ్చింది. ఈ విష‌యాన్ని గ‌మ‌నించి పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.పోలీసులు ర‌హాస్యంగా విచార‌ణ చేప‌ట్టారు. ఆధార్‌కు వేలిముద్ర‌లను ప‌రిశీలించ‌గా తేడా వ‌చ్చింది. వెంట‌నే పోలీసులు విచార‌ణ చేప‌ట్ట‌గా ఈ విష‌యాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -