Friday, April 19, 2024
- Advertisement -

పోటీలో గెలవండి..హెలికాప్టర్ లో ఫ్రీ రైడ్ పొందండి..!

- Advertisement -

కర్ణాటకలో వినూత్న కార్యక్రమాలు చేపడుతూ నిత్యం వార్తల్లో ఉండే మానవ బంధుత్వ వేదిక మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది. వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన వారిని హెలికాప్టర్​లో ఎక్కించి ఆ రైడ్​నే వారికి బహుమతిగా ఇచ్చింది. సావిత్రి బాయి పూలే జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి వ్యాసరచన, ఉపన్యాస పోటీల విజేతలకు ఈ హెలికాప్టర్​ రైడింగ్​ను బహుమతిగా ఇచ్చారు. మానవ బంధుత్వ వేదిక ఆధ్వర్యంలో గోకాకా పట్టణంలోని వాల్మీకి స్టేడియంలో ఈ కార్యక్రమం జరిగింది.

వైష్ణవి కడోల్కర్(బెల్గాం), జ్యోతి గుడ్డీన్(శిరగుప్పి), సుధా కర్లీ(రాయ‌చూర్‌), సిమ్రాన్ భగవన్(యాదవాడ), వి.మానస(చామరాజనగర్‌)లు వ్యాసరచన పోటీ విజేతలు.. వీరంతా హెలికాప్టర్ రైడ్‌లో పాల్గొన్నారు.ఈ రైడ్​ను చూసేందుకు వచ్చిన ప్రజలు, గెలుపొందిన విజేతల మోముల్లో సంతోషంతో స్టేడియం ప్రాంగణమంతా కోలాహలంగా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -