Tuesday, April 30, 2024
- Advertisement -

తెలంగాణలో కరోనా టీకా ఉచితం.. ప్రజల ప్రాణాలకన్నా డబ్బు ముఖ్యం కాదు : కెసిఆర్

- Advertisement -

రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందించనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ కరోనా టీకా ఉచితంగా ఇస్తామని వెల్లడించారు. ప్రజల ప్రాణాల కంటే డబ్బు ముఖ్యం కాదని తేల్చిచెప్పారు. ఇప్పటికే రాష్ట్రలో 35లక్షల మందికిపైగా టీకా తీసుకున్నారు. రెండు-మూడు రోజుల్లో నాకు అవసరమైన వైద్య పరీక్షలు జరిగి, పూర్తి స్వస్థత చేకూరిన తరువాత అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని స్వయంగా పర్యవేక్షిస్తా అని అన్నారు ముఖ్యమంత్రి.

టీకా పంపిణీ కార్యక్రమంతో పాటు, రెమ్‌డెసివిర్ తదితర కరోనా సంబంధిత మందులకు, ఆక్సిజన్‌కు ఎలాంటి కొరత రాకుండా చర్యలు తీసుకుంటాం. ప్రజలు ఏ విధమైన భయభ్రాంతులకు గురికావద్దు అన్నారు. వ్యాక్సినషన్ కోసం సుమారు రూ.2500 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. వ్యాక్సినేషన్ కోసం ఇప్పటికే అధికారులను ఆదేశించామని సిఎం తెలిపారు. తదనుగుణంగా మొత్తం రాష్ట్రంలో వున్న అందరికీ వాక్సినేషన్ ఇవ్వడానికి చర్యలు తీసుకోవాలని సిఎం కెసిఆర్ ఆదేశించారు.

ఇప్పటికే భారత్ బయోటెక్ వాక్సినేషన్ తయారీ చేస్తున్నదని, రెడ్డీ ల్యాబ్స్‌తో సహా మరికొన్ని సంస్థలు వాక్సినేషన్ తయారీకి ముందుకు వచ్చాయని, కాబట్టి వాక్సినేషన్ విషయంలో ఎలాంటి ఇబ్బంది వుండబోదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. పెద్ద ఎత్తున గుంపు-గుంపులుగా కూడవద్దని, ఊరేగింపులలో పాల్గొనవద్దని, అత్యవసరమైతేనే తప్ప బయట తిరగవద్దని, స్వయం క్రమశిక్షణ పాటించాలని ముఖ్యమంత్రి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజల క్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న ప్రభుత్వం కరోనా మహమ్మారి విషయంలో చేయాల్సినదంతా పటిష్టంగా చేస్తుందని కెసిఆర్ మరోమారు చెప్పారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -