Friday, May 3, 2024
- Advertisement -

విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో వైఎస్ జ‌గ‌న్‌పై హ‌త్యాయ‌త్నం…క‌త్తితో దాడి చేసిన యువ‌కుడు

- Advertisement -

ప్ర‌జాసంక‌ల్ప యాత్ర‌లో దూసుకుపోతున్న వైఎస్ జ‌గ‌న్ కు తృటిలో ప్ర‌మాదం త‌ప్పింది. పాద‌యాత్ర ముగించుకొని హైద‌రాబాద్ బ‌ల్దేరిన జ‌గ‌న్‌పై హత్యాయ‌త్నం జ‌ర‌గ‌డంతో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపుతోంది. హైద‌రాబాద్‌కు వ‌స్తున్న జ‌గ‌న్ విశాఖ ఏయిర్‌పోర్టుకు చేరుకున్నారు.

ఎయిర్‌పోర్ట‌లోని వీఐపీ లాంజ్‌లో కూర్చున్న జ‌గ‌న్ వ‌ద్ద‌కు వ‌చ్చి వైసీపీకి 106 సీట్లు వస్తాయా సార్? అంటూ జగన్ ను పలుకరించిన దుండగుడు… సెల్ఫీ దిగుతానంటూ దాడికి దిగాడు. జరిగిన ఘటనతో అక్కడున్న వారు అవాక్కయ్యరు. దాడి చేసిన వెయిటర్ శ్రీనివాస్ ను విమానాశ్రయం భద్రతా సిబ్బంది పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

దీంతో జ‌గ‌న్ చేతికి గాయం అయ్యింది. వెంట‌నే ఎయిర్‌పోర్ట్ ఆసుపత్రిలో ప్రాద‌మిక చికిత్స అనంత‌రం హైదురాబాద్ బ‌య‌ల్దేరారు జ‌గ‌న్. దాడి చేసే స‌మ‌యంలో అడ్డుకున్న వ్య‌క్తికి కూడా గాయాల‌య్యాయి. దాడి చేసిన వ్య‌క్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -