Tuesday, April 30, 2024
- Advertisement -

పోలీస్ క‌ష్ట‌డీలో శ్రీనివాస్ సుర‌క్షితంగా ఉంటాడు…విశాఖ సీపీ

- Advertisement -

విశాఖ విమానాశ్రయంలో జగన్ మీద కోడి కత్తితో దాడి చేసిన శ్రీనివాసరావు సంచలన ఆరోపణలు చేశాడు. తనకు ప్రాణాహని ఉందని, మీడియా వద్దకు తీసుకెళ్లాలంటూ గట్టిగా అరిచాడు. శ్రీనివాస‌రావును మూడు రోజులుగా సిట్ విచారిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఇవాలా హ‌టాత్తుగా అస్వస్ధతకు గురయ్యాడు. వెంటనే పోలీసులు వైద్యులను పిలిపించి చికిత్స అందించారు. దీనిపై వ‌స్తున్న ఊహాగానాల‌పై విశాఖ సీపీ స్పందించారు.

జగన్ పై దాడి కేసులో మూడు రోజులుగా విచారిస్తున్న నిందితుడు పూర్తి స్థాయిలో తమకు సహకరించడం లేదని సీపీ లడ్డా తెలిపారు. శ్రీనివాస్ కొన్ని విషయాలను దాచిపెడుతున్నాడని, వేర్వేరు కోణాల్లో ఈ కేసును దర్యాప్తు చేస్తున్నామన్నారు. శ్రీనివాస్ స్నేహితులు ఒడిశాలో ఉన్నార‌ని అక్క‌డ‌కు దర్యాప్తు బృందాన్ని పంపామని తెలిపారు.

ఎస్బీఐ, విజయబ్యాంక్, ఆంధ్రా బ్యాంక్ లలో శ్రీనివాస్ కు అకౌంట్లు ఉన్నాయని, తనతో పనిచేసే వ్యక్తి సెల్ ఫోన్ ను శ్రీనివాస్ వినియోగించాడని చెప్పారు. అతని ఖాతాలో ఒకసారి నలభైవేలు, మరోసారి ఇరవై వేల రూపాయలు జమయ్యాయని, డబ్బుు జమైన కాసేపటికే మరొకరి ఖాతాకు బదిలీ అయినట్టు తమ విచారణలో తెలిసిందని చెప్పారు. అయితే ఎవురు డబ్బులు ఎందుకు డిపాజిట్ చేశారో, ఆ డబ్బును ఎవరికి బదిలీ చేశారన్న విషయాలు తేలాల్సి ఉందని లడ్డా పేర్కొన్నారు. శ్రీనివాస్ పోలీస్ క‌ష్ట‌డీలో సుర‌క్షితంగా ఉంటాడ‌ని ఎటువంటి అనుమానాలు వ‌ద్ద‌ని తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -