Saturday, May 18, 2024
- Advertisement -

3000 కి.మీ మైలు రాయిన చేరుకున్న జ‌గ‌న్మోహ‌నుడు…

- Advertisement -

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ తన ప్రజాసంకల్పయాత్రలో భాగంగా నేడు 3 వేల కిలోమీటర్ల మైలురాయిని అధిగమించారు. గతేడాది నవంబర్‌ 6న ఇడుపులపాయలో ప్రారంభమైన పాదయాత్ర నేడు 3000 కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది.

జననేత జనం కోసం చేపట్టిన ప్రజాసంకల్పయాత్రలో సోమవారం మరో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. విజయనగరం జిల్లా, ఎస్‌కోట నియోజకవర్గం, కొత్తవలస మండలం దేశపాత్రునిపాలెం వద్ద 3000 కిలోమీటర్ల మైలురాయిని చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రజాసంకల్పయాత్ర 3000 కిలోమీటర్ల పైలాన్‌ను జననేత వైఎస్‌ జగన్‌ ఆవిష్కరించి ఓ మొక్క‌ను నాటారు. అనంత‌రం కేక్ ను కట్ చేసిన జగన్, తన యాత్రను కొనసాగించారు. కాగా, గత ఏడాది నవంబర్ 6న ఇడుపులపాయలో జగన్ ప్రజాసంకల్పయాత్ర కొన‌సాగుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -